భార్యతో కలిసిపోయిన ధనుష్.. మామ ఆఖరి కోరిక తీరుస్తాడా?
- November 06, 2024
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన ఎంత స్టార్ అయినా కూడా.. తన బిడ్డలను మాత్రం స్టార్స్ ను చేయలేకపోయాడు.
రజినీకి ఇద్దరు కూతుళ్లు. సౌందర్య రజినీకాంత్, ఐశ్వర్య రజినీకాంత్. హీరోయిన్స్ గా కాకుండా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిర్మాతలుగా మారారు. కానీ, అందులో ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు. తండ్రిగా రజినీ.. వారికి తోడుగా ఉన్నా కూడా విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.
ఇక రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. అయితే ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇక వీరిని కలపడానికి ఇరు కుటుంబాలు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ. తాము మాత్రం కలిసేది లేదని నిర్మొహమాటంగా తెలిపారు.
ఇక ఈ ఏడాదిలోనే వీరి విడాకుల కేసు కోర్టుకు వచ్చింది. కానీ, ఆ కేసుకు వీరిద్దరూ హాజరుకాకపోవడంతో మళ్లీ వీరు కలిసిపోనున్నారని వార్తలు వచ్చాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమయ్యాయని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ధనుష్- ఐశ్వర్య కలిసే ఉంటున్నారట. అంతేకాదు ఈ దీవాళీని కూడా ఈ జంట కలిసే సెలబ్రేట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరు కలవడానికి రజినీనే కారణమని అంటున్నారు.
ఈ మధ్యనే రజినీ అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. గుండెల్లో ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి వచ్చాకా.. ఆయన.. కూతురు అల్లుడు తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కూతురు – అల్లుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, అదే తన ఆఖరి కోరిక అని చెప్పడంతో ధనుష్- ఐశ్వర్య కొద్దిగా అలోచించి విడాకులను రద్దు చేసుకోనున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ధనుష్- ఐశ్వర్య మళ్లీ జంటగా మీడియా ముందుకు రానున్నారు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







