అగ్నిప్రమాదానికి గురైన హోటల్ మూసివేత..మరో హోటల్ కు గెస్టుల తరలింపు..!!
- November 07, 2024
దుబాయ్: దుబాయ్ లో గత శుక్రవారం అర్థరాత్రి హయత్ ప్లేస్, బనియాస్ స్క్వేర్ డీరా హోటల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా అధికారులు తాత్కాలికంగా దానిని మూసివేశారు. అందులో ఉన్న గెస్టులను అదే మేనేజ్ మెంట్ నిర్వహణలో పనిచేసే సమీపంలోని మరో హోటల్లకు తరలించారు. ప్రమాదం సమయంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ సిబ్బంది సకాలంలో ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అతిథులతోపాటు వారి వస్తువులను తరలించినట్టు హోటల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఘటన తర్వాత హోటల్కు తిరిగి రాని అతిథులు వచ్చి తమ వస్తువులను తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పటికే బుకింగ్లు చేసుకున్న అతిథులు సమీపంలో ఉన్న మరో హోటల్లో బస కల్పిస్తామన్నారు. హోటల్ మూసివేతతో పాటు భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్లు, దుకాణాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









