అగ్నిప్రమాదానికి గురైన హోటల్ మూసివేత..మరో హోటల్ కు గెస్టుల తరలింపు..!!
- November 07, 2024
దుబాయ్: దుబాయ్ లో గత శుక్రవారం అర్థరాత్రి హయత్ ప్లేస్, బనియాస్ స్క్వేర్ డీరా హోటల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా అధికారులు తాత్కాలికంగా దానిని మూసివేశారు. అందులో ఉన్న గెస్టులను అదే మేనేజ్ మెంట్ నిర్వహణలో పనిచేసే సమీపంలోని మరో హోటల్లకు తరలించారు. ప్రమాదం సమయంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ సిబ్బంది సకాలంలో ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అతిథులతోపాటు వారి వస్తువులను తరలించినట్టు హోటల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఘటన తర్వాత హోటల్కు తిరిగి రాని అతిథులు వచ్చి తమ వస్తువులను తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పటికే బుకింగ్లు చేసుకున్న అతిథులు సమీపంలో ఉన్న మరో హోటల్లో బస కల్పిస్తామన్నారు. హోటల్ మూసివేతతో పాటు భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్లు, దుకాణాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







