కువైట్లో 'ఎంపరర్ ఆఫ్ ది మ్యాట్స్'..భారత విద్యార్థికి రజత పతకం..!!
- November 07, 2024
కువైట్: కువైట్లో జరిగిన ప్రతిష్టాత్మక ఎంపరర్ ఆఫ్ ది మ్యాట్స్ IV ఎడిషన్ జుజుట్సు టోర్నమెంట్లో భారతీయ విద్యార్థి ఇషాక్ ఇంతియాజ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఎంపరర్ ఆఫ్ ది మ్యాట్స్ అనేది EBI స్టైల్ జుజుట్సు టోర్నమెంట్. ఇది ప్రత్యర్థిని ఓడించడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగించే ఒక యుద్ధ కళ. టోర్నమెంట్ కువైట్లో అక్టోబర్ 5న ఫహాహీల్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగింది.
మిస్టర్ ఇషాక్ ఇంతియాజ్.. ప్రఖ్యాత టోర్నమెంట్లో పాల్గొన్న ఏకైక భారతీయుడు మంగాఫ్లోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ (IIS)లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి.భారతదేశంలోని తమిళనాడుకు చెందిన మిస్టర్ ఇషాక్ ఈ అరుదైన మార్షల్ ఆర్ట్స్ కోసం కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన తన తండ్రి మిస్టర్ ఇంతియాజ్ హాజా మైదీన్ నుండి ప్రేరణ పొందినట్టు తెలిపాడు.ఇంతియాజ్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో ఐటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇషాక్ తల్లి స్టార్బక్స్ కువైట్లో మేనేజర్గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







