ఒమన్ లో నెలకు RO2,500 సంపాదించే వారి పై ఇన్కమ్ టాక్స్
- November 08, 2024
మస్కట్: ఒమన్ లో RO2,500 కంటే ఎక్కువ నెలవారీ సంపాదన కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని త్వరలో వ్యక్తిగత ఆదాయపు పన్నును అమలు చేయనున్నట్లు మజ్లిస్ అ'షురా యొక్క ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ కమిటీ ఛైర్మన్ అహ్మద్ అల్ షర్కీ తెలిపారు. మంగళవారం నాడు షురా యొక్క వార్షిక మీడియా సమావేశంలో, సంవత్సరానికి RO30,000 కంటే ఎక్కువ సంపాదించే వారు కొత్త చట్టం ప్రకారం పన్నుకు లోబడి ఉంటారని షర్కీ ధృవీకరించారు, దీనిని ప్రస్తుతం స్టేట్ కౌన్సిల్ పరిశీలిస్తోంది.
అయితే ఒమన్లో ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయంపై పన్ను లేదు. అంటే, వ్యక్తులు తమ సంపాదనపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే, కంపెనీలు మరియు ఇతర వ్యాపార సంస్థలు మాత్రం తమ ఆదాయంపై పన్ను చెల్లించాలి.
ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఒమన్లో వ్యక్తిగత ఆదాయంపై పన్ను లేకపోవడం ఒక ప్రత్యేకత. ప్రస్తుతం ఒమన్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వ్యాపార సంస్థలతో పాటు వ్యక్తులకు వర్తిస్తుంది.
ప్రస్తుతం ఒమన్లోని కంపెనీలు తమ సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించాలి. సాధారణంగా, ఈ పన్ను రేటు 15% ఉంటుంది. అయితే, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (SMEs) కొంత తక్కువ పన్ను రేటు చెల్లించవచ్చు.
పెట్రోలియం కంపెనీలకు ప్రత్యేక పన్ను రేటు 55% ఉంటుంది, కానీ ఈ రేటు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ఆధారంగా మారవచ్చు.అయితే, 2020-2024 మధ్యకాలిక ఆర్థిక ప్రణాళికలో వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రవేశపెట్టే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









