విజన్ 2040.. చైనాకు చేపల ఎగుమతులను ప్రారంభించిన ఒమన్..!!
- November 10, 2024
మస్కట్: ఫిష్ మార్కెటింగ్, సేల్స్ రంగంలోని ఒమానీ కంపెనీల సమూహం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చేపల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించింది.ఇది మత్స్య పరిశ్రమ కోసం ఒమన్ విజన్ 2040 లక్ష్యాలను సాధించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ రంగం లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించడం, పెరిగిన ఎగుమతులు మరియు కొత్త ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడం ద్వారా ఒమానీ ఆర్థిక వ్యవస్థలో దాని పాత్రను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యమని తెలిపారు. ఒమానీ చేపల ఉత్పత్తుల విలువను పెంపొందించడానికి, వాటి అంతర్జాతీయ పరిధిని విస్తరించడానికి కృషి చేస్తుందని మంత్రిత్వ శాఖలోని అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ మార్కెటింగ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మసౌద్ బిన్ సులేమాన్ అల్ అజ్రీ తెలిపారు. ఒమన్, చైనా ప్రభుత్వాల మధ్య సంతకం చేసిన అధికారిక ఒప్పందం లేదా "ప్రోటోకాల్" ప్రకారం ఈ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఎగుమతుల ప్రారంభం ఒమన్, చైనా మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, వాణిజ్యానికి కొత్త అవకాశాలను సృష్టించడం, ఆహార భద్రతకు దోహదం చేస్తుందన్నారు. 2023లో ఒమన్లో చేపల ఉత్పత్తి 793,000 టన్నులకు చేరుకుంది.ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 6% అధికం.దీని విలువ OMR 531 మిలియన్లు కాగా,దాదాపు 324,000 టన్నుల ఎగుమతులు(OMR 189 మిలియన్లు) జరిగాయి.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









