విజన్ 2040.. చైనాకు చేపల ఎగుమతులను ప్రారంభించిన ఒమన్..!!
- November 10, 2024
మస్కట్: ఫిష్ మార్కెటింగ్, సేల్స్ రంగంలోని ఒమానీ కంపెనీల సమూహం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చేపల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించింది.ఇది మత్స్య పరిశ్రమ కోసం ఒమన్ విజన్ 2040 లక్ష్యాలను సాధించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ రంగం లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించడం, పెరిగిన ఎగుమతులు మరియు కొత్త ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడం ద్వారా ఒమానీ ఆర్థిక వ్యవస్థలో దాని పాత్రను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యమని తెలిపారు. ఒమానీ చేపల ఉత్పత్తుల విలువను పెంపొందించడానికి, వాటి అంతర్జాతీయ పరిధిని విస్తరించడానికి కృషి చేస్తుందని మంత్రిత్వ శాఖలోని అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ మార్కెటింగ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మసౌద్ బిన్ సులేమాన్ అల్ అజ్రీ తెలిపారు. ఒమన్, చైనా ప్రభుత్వాల మధ్య సంతకం చేసిన అధికారిక ఒప్పందం లేదా "ప్రోటోకాల్" ప్రకారం ఈ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఎగుమతుల ప్రారంభం ఒమన్, చైనా మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, వాణిజ్యానికి కొత్త అవకాశాలను సృష్టించడం, ఆహార భద్రతకు దోహదం చేస్తుందన్నారు. 2023లో ఒమన్లో చేపల ఉత్పత్తి 793,000 టన్నులకు చేరుకుంది.ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 6% అధికం.దీని విలువ OMR 531 మిలియన్లు కాగా,దాదాపు 324,000 టన్నుల ఎగుమతులు(OMR 189 మిలియన్లు) జరిగాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







