ఎయిరిండియాలోకి మరో రూ.3,195 కోట్లు
- November 11, 2024
న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్ కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో, సింగపూర్ ఎయిర్లైన్స్ గ్రూప్ విస్తారాను విలీనం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ రెండు సంస్థల విలీన ప్రక్రియ 2022 నవంబర్ 29న స్టార్ట్ కాగా ఈ రోజు పూర్తి కానుంది.కాగా విలీనం తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్ కు ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటా ఉండనుంది.ఈ నేపథ్యంలో సింగపూర్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో రూ. 3,195 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది.కాగా విస్తారా 2015 జనవరి 9 నుంచి మన ఇండియాలో సేవలందిస్తోంది. అయితే విలీనం తర్వాత ఈ నెల 12 నుంచి ఎయిర్ ఇండియా-విస్తారా కలిసి ఒకటే విమానయాన సంస్థగా సేవలు అందించనుంది. ఎయిర్ ఇండియా అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడుతామని సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







