ఎయిరిండియాలోకి మరో రూ.3,195 కోట్లు

- November 11, 2024 , by Maagulf
ఎయిరిండియాలోకి మరో రూ.3,195 కోట్లు

న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్ కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ విస్తారాను విలీనం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ రెండు సంస్థల విలీన ప్రక్రియ 2022 నవంబర్ 29న స్టార్ట్ కాగా ఈ రోజు పూర్తి కానుంది.కాగా విలీనం తర్వాత సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటా ఉండనుంది.ఈ నేపథ్యంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో రూ. 3,195 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది.కాగా విస్తారా 2015 జనవరి 9 నుంచి మన ఇండియాలో సేవలందిస్తోంది. అయితే విలీనం తర్వాత ఈ నెల 12 నుంచి ఎయిర్ ఇండియా-విస్తారా కలిసి ఒకటే విమానయాన సంస్థగా సేవలు అందించనుంది. ఎయిర్ ఇండియా అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడుతామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com