ఒమాన్ లో వృద్ధుల డే కేర్ సెంటర్లకు కొత్త ప్రమాణాలు
- November 11, 2024
మస్కట్: ఒమాన్లో వృద్ధులకు మెరుగైన సేవలు అందించడానికి, మరియు డే కేర్ సెంటర్ల నిర్వహణను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లకు కొత్త ప్రమాణాలు సెట్ చేయబడ్డాయి. హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ లైలా బింట్ అహ్మద్ అల్ నజ్జర్, సాంఘిక అభివృద్ధి మంత్రి, వృద్ధుల డే కేర్ సెంటర్ల కోసం గవర్నెన్స్ ఫ్రేమ్ వర్కు ఏర్పాటు చేయడానికి డిక్రీ 344/2024 నీ జారీ చేశారు. నవంబర్ 6, 2024న జారీ చేసిన ఈ నిర్ణయం ఈరోజు నుంచి అమల్లోకి వస్తుంది.
ఈ డే కేర్ సెంటర్లలో చేరడానికి వృద్ధులు కనీసం 60 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, 45 సంవత్సరాల వయసు ఉన్నవారిని కూడా అనుమతించవచ్చు, కానీ ఇది సంబంధిత అధికారుల అనుమతితోనే సాధ్యం. వృద్ధులు అంటువ్యాధులు, తీవ్రమైన మానసిక రుగ్మతలు లేకుండా ఉండాలి.
డే కేర్ సెంటర్ నిర్వహించడానికి, లైసెన్స్ పొందడం తప్పనిసరి. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి కనీసం 25 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. లైసెన్స్ మూడు సంవత్సరాల కాలానికి జారీ చేయబడుతుంది మరియు పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. లైసెన్స్ పొందడానికి దరఖాస్తుదారు ఒమాన్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సామాజిక శాస్త్రాలలో లేదా సంబంధిత రంగంలో డిగ్రీ పొందినవారై ఉండాలి.
డే కేర్ సెంటర్ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మరియు ప్రమాణాలు పాటించకపోతే, జరిమానాలు విధించబడతాయి. లైసెన్స్ లేకుండా సెంటర్ నిర్వహిస్తే, 2,000 రియాల్స్ జరిమానా విధించబడుతుంది. ఇతర ఉల్లంఘనలకు 500 నుండి 1,000 రియాల్స్ వరకు జరిమానాలు విధించబడతాయి. ఈ విధంగా, ఒమాన్లో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లకు కొత్త ప్రమాణాలు సెట్ చేయడం ద్వారా, వృద్ధులకు మెరుగైన సేవలు అందించడానికి, మరియు సెంటర్ల నిర్వహణను మరింత నాణ్యంగా చేయడానికి చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







