ఇజ్రాయెల్ దురాక్రమణపై నిప్పులు చెరిగిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- November 12, 2024
రియాద్: గాజా, లెబనాన్లపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణను తమ దేశం తీవ్రంగా ఖండిస్తుందని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ పునరుద్ఘాటించారు. సోమవారం రియాద్లో అసాధారణ అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ను ప్రారంభించిన ఆయన, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఇజ్రాయెల్ను ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. పాలస్తీనా అథారిటీ పాత్రను తగ్గించడాన్ని, గాజాలో మానవతావాద సంస్థల పనిని అడ్డుకోవడంపై క్రౌన్ ప్రిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. "అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతరం నేరాలు చేయడం, అల్-అక్సా మసీదు పవిత్రతను నిరంతరం ఉల్లంఘించడం వల్ల పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కుల భద్రతను దెబ్బతీస్తుందని మేము ధృవీకరిస్తున్నాము" అని అతను పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యత్వానికి పాలస్తీనాకు అర్హత ఉందని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









