చైనాలో కార్ ఢీకొట్టి 35 మంది మృతి
- November 13, 2024
చైనాలో దారుణ ఘటన జరిగింది. అమాయమైన ప్రజలపైకి కారుని పోనిచ్చి 35 మంది ప్రాణాలు తీశాడు. దక్షిణ చైనాలోని జూహై నగరంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు మంగళవారం తెలిపారు.
సోమవారం సాయంత్రం జరిగిన ఘటనలో, పోలీసులు ముందుగా ప్రజలు గాయపడ్డారని నివేదించారు. అయితే, ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో మంగళవారం మరణించిన వారి సంఖ్యను వెల్లడించారు.
జూహై స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన దుర్మార్గపు దాడిలో మరణించిన వారి సంఖ్య 35 అని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి 62 ఏళ్ల వ్యక్తి పాల్పడ్డాడు. అతడి ఇంటిపేరును ఫ్యాన్గా గుర్తించారు. గేటు బయట నుంచి చిన్న ఎస్యూవీ కార్ని నగరంలోని స్పోర్ట్ సెంటర్లోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్న వ్యక్తులపైకి పోనిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు తన గొంతు కోసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతడి మెడ, ఇతర శరీర భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో కోమాలో ఉన్నాడు, విచారించేందుకు సాధ్యపడలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ స్పందించారు. గాయపడిన వారికి అన్ని విధాల చికిత్స అందించాలని ఆదేశించాడరు. నేరస్తుడిని చట్టప్రకారం శిక్షించాలని కోరినట్లు అధికారిక జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







