రాజధాని అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన ..

- June 24, 2016 , by Maagulf
రాజధాని  అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన ..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోశనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన చేశారు. రూ.215 కోట్లతో 18.3 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలేనికి కొత్త రహదారినిర్మించి, 6 వరుసల రహదారిని కొత్తగా నిర్మించే రహదారికి అనుసంధానం చేస్తారు. ఇందులో భాగంగా కనకదుర్గ వారధి మార్గం నుంచి పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ వరకు పైవంతెన నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు చిన రాజప్ప, రావెల కిశోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎంపీ గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యేలు టి.శ్రావణ్‌కుమార్‌, జి.వి.ఆంజనేయులు, పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com