రాజధాని అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన ..
- June 24, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోశనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన చేశారు. రూ.215 కోట్లతో 18.3 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలేనికి కొత్త రహదారినిర్మించి, 6 వరుసల రహదారిని కొత్తగా నిర్మించే రహదారికి అనుసంధానం చేస్తారు. ఇందులో భాగంగా కనకదుర్గ వారధి మార్గం నుంచి పీడబ్ల్యూ వర్క్షాప్ వరకు పైవంతెన నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు చిన రాజప్ప, రావెల కిశోర్బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు టి.శ్రావణ్కుమార్, జి.వి.ఆంజనేయులు, పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ









