రాజధాని అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన ..
- June 24, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోశనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన చేశారు. రూ.215 కోట్లతో 18.3 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలేనికి కొత్త రహదారినిర్మించి, 6 వరుసల రహదారిని కొత్తగా నిర్మించే రహదారికి అనుసంధానం చేస్తారు. ఇందులో భాగంగా కనకదుర్గ వారధి మార్గం నుంచి పీడబ్ల్యూ వర్క్షాప్ వరకు పైవంతెన నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు చిన రాజప్ప, రావెల కిశోర్బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు టి.శ్రావణ్కుమార్, జి.వి.ఆంజనేయులు, పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









