శుభవార్త..ఇంటర్సిటీ బస్ సర్వీసెస్ విస్తరణ..!!
- November 21, 2024
యూఏఈ: మెట్రో, ట్రామ్, సముద్ర రవాణా వంటి ఇతర మాస్ ట్రాన్సిట్ మోడ్లతో పబ్లిక్ బస్సులను మరింత అనుసంధానించబడాలని పెరుగుతున్న డిమాండ్కు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) స్పందించింది. బస్సు నెట్వర్క్, ఇంటర్సిటీ బస్సు సేవలను విస్తరించాలని యోచనలో ఉన్నట్ల ప్రకటించింది. యూఏఈ అంతటా ఉన్న ఇతర ఎమిరేట్లతో దుబాయ్ని కలిపే ఇంటర్సిటీ మార్గాలను కవర్ చేసేలా సర్వీసులను విస్తరించనున్నట్లు 'మాతో మాట్లాడండి' వర్చువల్ సెషన్ సందర్భంగా ప్రకటించింది.
ఆర్టీఏ ప్రకారం, ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు బస్సులు 89.2 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించాయి. దుబాయ్లోని ప్రధాన రహదారులలో పీక్-అవర్ ట్రాఫిక్ను 30 శాతం తగ్గించగల రిమోట్, ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్క్ విధానాలను అమలు చేయాలని నిర్ణయించినట్టు ఈ నెల ప్రారంభంలో ఆర్టీఏ ప్రకటించింది. ట్రక్కుల కదలికలపై పరిమితులను విధించడంతోపాటు బస్సులు, టాక్సీల కోసం ప్రత్యేక మార్గాలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదే సమయంలో నివాసితులు, సందర్శకులు ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలను చేపట్టనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







