హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో లోక్ మంథన్ ఉత్సవం
- November 21, 2024
హైదరాబాద్: హైదరాబాద్లో లోక్ మంథన్ 2024 అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం ఈరోజు ఎంతో వైభవంగా ప్రారంభమైంది.ఈ ఉత్సవాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ ఉత్సవం నవంబర్ 21 నుండి 24 వరకు హైదరాబాద్లోని శిల్పారామంలో జరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే లోక్ మంథన్ 2024 అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవంలో రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం భారతీయ జానపద సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడం.
ఈ ఉత్సవంలో వివిధ దేశాల నుండి వచ్చే సాంస్కృతిక ప్రతినిధులు, కళాకారులు పాల్గొంటారు. ఉత్సవంలో నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక చర్చలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఉత్సవం ద్వారా వివిధ దేశాల సాంస్కృతిక సంపదను పరిచయం చేయడం, సాంస్కృతిక మార్పిడి జరగడం ప్రధాన లక్ష్యం. ఈ ఉత్సవం ద్వారా ప్రజలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆస్వాదించవచ్చు మరియు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో జరిగే లోక్ మంథన్ 2024 ఒక సాంస్కృతిక పండుగగా నిలుస్తుంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









