హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో లోక్ మంథన్ ఉత్సవం
- November 21, 2024
హైదరాబాద్: హైదరాబాద్లో లోక్ మంథన్ 2024 అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం ఈరోజు ఎంతో వైభవంగా ప్రారంభమైంది.ఈ ఉత్సవాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ ఉత్సవం నవంబర్ 21 నుండి 24 వరకు హైదరాబాద్లోని శిల్పారామంలో జరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే లోక్ మంథన్ 2024 అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవంలో రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం భారతీయ జానపద సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడం.
ఈ ఉత్సవంలో వివిధ దేశాల నుండి వచ్చే సాంస్కృతిక ప్రతినిధులు, కళాకారులు పాల్గొంటారు. ఉత్సవంలో నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక చర్చలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఉత్సవం ద్వారా వివిధ దేశాల సాంస్కృతిక సంపదను పరిచయం చేయడం, సాంస్కృతిక మార్పిడి జరగడం ప్రధాన లక్ష్యం. ఈ ఉత్సవం ద్వారా ప్రజలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆస్వాదించవచ్చు మరియు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో జరిగే లోక్ మంథన్ 2024 ఒక సాంస్కృతిక పండుగగా నిలుస్తుంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







