హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో లోక్ మంథన్ ఉత్సవం
- November 21, 2024
హైదరాబాద్: హైదరాబాద్లో లోక్ మంథన్ 2024 అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం ఈరోజు ఎంతో వైభవంగా ప్రారంభమైంది.ఈ ఉత్సవాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ ఉత్సవం నవంబర్ 21 నుండి 24 వరకు హైదరాబాద్లోని శిల్పారామంలో జరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే లోక్ మంథన్ 2024 అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవంలో రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం భారతీయ జానపద సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడం.
ఈ ఉత్సవంలో వివిధ దేశాల నుండి వచ్చే సాంస్కృతిక ప్రతినిధులు, కళాకారులు పాల్గొంటారు. ఉత్సవంలో నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక చర్చలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఉత్సవం ద్వారా వివిధ దేశాల సాంస్కృతిక సంపదను పరిచయం చేయడం, సాంస్కృతిక మార్పిడి జరగడం ప్రధాన లక్ష్యం. ఈ ఉత్సవం ద్వారా ప్రజలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆస్వాదించవచ్చు మరియు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో జరిగే లోక్ మంథన్ 2024 ఒక సాంస్కృతిక పండుగగా నిలుస్తుంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







