జాయింట్ ఆపరేషన్..ఎయిర్పోర్ట్లో డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్ బస్ట్..!!
- November 22, 2024
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ విజయవంతం అయింది. ఎయిర్ కార్గో ఫెసిలిటీలో భారీగా రవాణా అవుతున్న అక్రమ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెథాంఫేటమిన్ ("షాబు"), గంజాయి, CBD ఉత్పత్తులతో సహా 11,000 దీనార్ల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసినట్టు తెలిపారు. డ్రగ్స్ ప్యాకేజీని తీసుకునేందుకు ప్రయత్నించిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను టెస్టింగ్ కోసం పంపామని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ పేర్కొంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కమ్యూనిటీ భాగస్వామ్యం ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









