జాయింట్ ఆపరేషన్..ఎయిర్పోర్ట్లో డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్ బస్ట్..!!
- November 22, 2024
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ విజయవంతం అయింది. ఎయిర్ కార్గో ఫెసిలిటీలో భారీగా రవాణా అవుతున్న అక్రమ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెథాంఫేటమిన్ ("షాబు"), గంజాయి, CBD ఉత్పత్తులతో సహా 11,000 దీనార్ల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసినట్టు తెలిపారు. డ్రగ్స్ ప్యాకేజీని తీసుకునేందుకు ప్రయత్నించిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను టెస్టింగ్ కోసం పంపామని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ పేర్కొంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కమ్యూనిటీ భాగస్వామ్యం ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







