జాయింట్ ఆపరేషన్..ఎయిర్పోర్ట్లో డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్ బస్ట్..!!
- November 22, 2024
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ విజయవంతం అయింది. ఎయిర్ కార్గో ఫెసిలిటీలో భారీగా రవాణా అవుతున్న అక్రమ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెథాంఫేటమిన్ ("షాబు"), గంజాయి, CBD ఉత్పత్తులతో సహా 11,000 దీనార్ల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసినట్టు తెలిపారు. డ్రగ్స్ ప్యాకేజీని తీసుకునేందుకు ప్రయత్నించిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను టెస్టింగ్ కోసం పంపామని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ పేర్కొంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కమ్యూనిటీ భాగస్వామ్యం ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









