ఖతార్ జాతీయులకు యూఎస్ వీసా రహిత ప్రయాణం.. ESTA ప్రారంభం..!!
- November 22, 2024
దోహా: ఖతార్లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI).. యూఎస్ సమన్వయంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ESTA)ని నవంబర్ 22నుండి ప్రారంభం కానుంది. ఈ సిస్టమ్ వీసా మినహాయింపు కార్యక్రమం (VWP) కింద యునైటెడ్ స్టేట్స్కు వెళ్లేందుకు ఖతారీ పౌరులను అనుమతిస్తుంది. యూఎస్ ను సందర్శించడానికి వీసా లేకుండ 90 రోజుల వరకు ఉండేందుకు అనుమతియ్యానున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ ప్రకటించింది. " ఖతార్ పౌరులు అధికారిక ESTA వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ల ద్వారా ప్రయాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రయాణ తేదీకి కనీసం 72 గంటల ముందు అవసరమైన ఫారమ్ పూర్తి చేయాలి. వీసా మినహాయింపు ప్రోగ్రామ్ కింద అవసరమైన ప్రయాణ, గుర్తింపు పత్రాలను సమర్పించాలి.’’ అని వెల్లడించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







