BAPS హిందూ మందిర్ అబుదాబికి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు..!!
- November 22, 2024
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్.. మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. నవంబర్ 20న యూఏఈలోని దుబాయ్ మెరీనాలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో మష్రెక్తో ఆధ్వర్యంలో జరిగిన MEED ప్రాజెక్ట్ అవార్డ్స్ 2024లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంది. బాప్స్ మందిర్ నిర్మాణ నైపుణ్యం, సాంస్కృతిక ప్రాముఖ్యత, సానుకూల సామాజిక ప్రభావానికి గుర్తింపు లభించింది. యూఏఈలో ఉత్తమ సాంస్కృతిక ప్రాజెక్ట్, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా (MENA)లో ఉత్తమ సాంస్కృతిక ప్రాజెక్ట్ (MENA) అవార్డులను అందుకుంది.
2007 నుండి MENA ప్రాంతంలో గోల్డ్ స్టాండర్డ్గా గుర్తింపుపొందిన MEED ప్రాజెక్ట్ అవార్డ్స్.. ఇంజనీరింగ్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీలో అత్యుత్తమమైన వాటిని గుర్తించి సత్కరిస్తుంది. బాప్స్ హిందూ మందిర్ కమిటీ, క్యాపిటల్ ఇంజినీరింగ్లోని వారి భాగస్వాములతో కలిసి అవార్డులను స్వీకరించారు.
రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంపై BAPS హిందూ మందిర్ అధిపతి పూజ్య బ్రహ్మవిహారి స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు మందిర్ సాంకేతిక, నిర్మాణ నైపుణ్యాన్ని మాత్రమే కాదని, దాని సృష్టిని ప్రేరేపించిన ఐక్యత, సామరస్య స్ఫూర్తిని కూడా హైలైట్ చేస్తుందన్నారు. H.H. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దాతృత్వం, మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వం కారణంగా మందిర్ నిర్మాణం కల సాకారమైందని పేర్కొన్నారు.

తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







