కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- November 26, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు, పథకాలను ఆమోదించింది. ఇందులో వ్యవసాయం, ఆవిష్కరణలు, విద్య, ఇంధన వరులు, ఇన్ఫ్రా స్ట్రక్చర్ తదితర రంగాలకు సంబంధించిన నిర్ణయాలున్నాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియా సమావేశంలోవివరించారు.
పాన్కార్డు ఆధునీకరణకు ఆమోదం తెలుపుతూ పాన్ 2.0కి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలను దీనికి జోడించనుంది. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’’ స్కీమ్ను ప్రారంభించాలని నిర్ణయించింది. తద్వారా ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీల జర్నల్స్, పరిశోధనా పత్రాలను మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
స్వతంత్ర కేంద్ర ప్రాయోజిత పథకంగా ‘‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’’ను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గంఆమోదం తెలిపింది. దీనికోసం మొత్తం రూ.2,481 కోట్ల ఆర్థిక వ్యయాన్ని హైలైట్ చేశారు. ఇందులో భారత ప్రభుత్వం రూ.1,584 కోట్లు, మిగిలిన రూ.897 కోట్లు రాష్ట్రాలు భరిస్తాయి. ఇక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు AIM 2.0కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది రూ.2,750 కోట్ల బడ్జెట్తో మార్చి 31, 2028 వరకు కొనసాగుతుంది.
అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి జిల్లాలో 240 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పెట్టుబడి ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,939 కోట్ల వ్యయంతో 50 నెలల కాల వ్యవధితో ఈ ప్రాజెక్ట్ ఈశాన్య ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రూ.7,927 కోట్లతో మూడు మల్టిట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను క్యాబినెట్ మంజూరు చేసింది.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









