ఆస్కార్ ఆఫ్ జర్నలిజంలో రెండు మీడియా అవార్డులను గెల్చుకున్న ఒమాన్
- November 27, 2024
మస్కట్: లండన్లో జరిగిన ఆస్కార్ ఆఫ్ జర్నలిజం వేడుకలో ఒమన్ సుల్తానేట్ రెండు మీడియా అవార్డులను అందుకుంది. లండన్లో జరిగిన వార్షిక ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (FPA) మీడియా అవార్డ్స్ వేడుకలో ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.ఈ అవార్డులను ‘ఆస్కార్ ఆఫ్ జర్నలిజం’ అని కూడా పిలుస్తారు.
ఈ అవార్డులలో మొదటిది ‘ట్రావెల్ టూరిజం స్టోరీ ఆఫ్ ది ఇయర్’. రెండవది ‘బెస్ట్ టీవీ మరియు రేడియో స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీలో ఈ అవార్డులు లభించాయి .
ఈ అవార్డులను యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబారి బదర్ మహ్మద్ అల్ మంథేరి విజేతలైన మీడియా నిపుణులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లండన్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయానికి చెందిన పలువురు మీడియా నిపుణులు, కళాకారులు, మేధావులు మరియు దౌత్యవేత్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు. వార్షిక ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (FPA) మీడియా అవార్డ్స్లో పాల్గొన్న సందర్భంగా ఒమన్ సుల్తానేట్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గర్వకారణంగా ఉందనీ ఒమన్ రాయబారి బదర్ మహ్మద్ అల్ మంథేరి తన సంతోషం వ్యక్తం చేశారు.
ఇంకా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఒమన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ అవార్డులు ఒమన్ లోని మీడియా రంగాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశం తరపున ఈ గౌరవాన్ని అందుకోవడం పట్ల వారు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు ఒమన్ మీడియా రంగంలో ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తాయనీ వారు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఒమన్ మీడియా రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించే ఈ వేడుక ఒమన్ యొక్క వారసత్వం మరియు సంస్కృతిని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం అని వారు తమ అభిప్రాయం తెలిపారు.
ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో ఒమానీ క్రాఫ్ట్లు మరియు డిజైన్లను ప్రదర్శించే ఒక గ్యాలరీతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన కూడా జరిగింది. మొత్తానికి ఈ అవార్డుల ప్రదానోత్సవం జర్నలిజం రంగంలో ఉన్నత ప్రమాణాలను గుర్తించడానికి మరియు ప్రోత్సహించడానికి నిర్వహించబడింది. ఒమన్ సుల్తానేట్ ఈ అవార్డులను అందుకోవడం ద్వారా తమ దేశం మీడియా రంగంలో ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తుందని నిరూపించింది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







