ఆస్కార్ ఆఫ్ జర్నలిజంలో రెండు మీడియా అవార్డులను గెల్చుకున్న ఒమాన్
- November 27, 2024
మస్కట్: లండన్లో జరిగిన ఆస్కార్ ఆఫ్ జర్నలిజం వేడుకలో ఒమన్ సుల్తానేట్ రెండు మీడియా అవార్డులను అందుకుంది. లండన్లో జరిగిన వార్షిక ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (FPA) మీడియా అవార్డ్స్ వేడుకలో ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.ఈ అవార్డులను ‘ఆస్కార్ ఆఫ్ జర్నలిజం’ అని కూడా పిలుస్తారు.
ఈ అవార్డులలో మొదటిది ‘ట్రావెల్ టూరిజం స్టోరీ ఆఫ్ ది ఇయర్’. రెండవది ‘బెస్ట్ టీవీ మరియు రేడియో స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీలో ఈ అవార్డులు లభించాయి .
ఈ అవార్డులను యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబారి బదర్ మహ్మద్ అల్ మంథేరి విజేతలైన మీడియా నిపుణులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లండన్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయానికి చెందిన పలువురు మీడియా నిపుణులు, కళాకారులు, మేధావులు మరియు దౌత్యవేత్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు. వార్షిక ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (FPA) మీడియా అవార్డ్స్లో పాల్గొన్న సందర్భంగా ఒమన్ సుల్తానేట్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గర్వకారణంగా ఉందనీ ఒమన్ రాయబారి బదర్ మహ్మద్ అల్ మంథేరి తన సంతోషం వ్యక్తం చేశారు.
ఇంకా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఒమన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ అవార్డులు ఒమన్ లోని మీడియా రంగాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశం తరపున ఈ గౌరవాన్ని అందుకోవడం పట్ల వారు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు ఒమన్ మీడియా రంగంలో ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తాయనీ వారు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఒమన్ మీడియా రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించే ఈ వేడుక ఒమన్ యొక్క వారసత్వం మరియు సంస్కృతిని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం అని వారు తమ అభిప్రాయం తెలిపారు.
ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో ఒమానీ క్రాఫ్ట్లు మరియు డిజైన్లను ప్రదర్శించే ఒక గ్యాలరీతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన కూడా జరిగింది. మొత్తానికి ఈ అవార్డుల ప్రదానోత్సవం జర్నలిజం రంగంలో ఉన్నత ప్రమాణాలను గుర్తించడానికి మరియు ప్రోత్సహించడానికి నిర్వహించబడింది. ఒమన్ సుల్తానేట్ ఈ అవార్డులను అందుకోవడం ద్వారా తమ దేశం మీడియా రంగంలో ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తుందని నిరూపించింది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







