సౌదీ అరేబియాలో పర్యాటకులకు VAT రీఫండ్ సిస్టమ్ ప్రారంభం..!!
- November 27, 2024
రియాద్: సౌదీ అరేబియా 2025లో పర్యాటకుల కోసం వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) రీఫండ్ సిస్టమ్ను ప్రవేశపెడుతుంది. ఈ మేరకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సౌదీ బడ్జెట్ ప్రకటనలో వివరించారు. జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ ఈ వ్యవస్థ అమలును పర్యవేక్షిస్తుంది. ఈ చొరవ సౌదీ అరేబియా సందర్శకులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి, రాజ్యాన్ని అన్వేషించడానికి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పర్యాటక వ్యయం 2025లో SR346.6 బిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతుందని, చమురుయేతర ఆదాయాలను పెంచుతుందని, ప్రైవేట్ రంగ డిమాండ్ను పెంచుతుందని భావిస్తున్నారు. 2024 చివరి నాటికి, సౌదీ అరేబియా 119.6 మిలియన్ల పర్యాటకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, 2024 మధ్య నాటికి పర్యాటక వ్యయం SR156.6 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









