జ్యువెలరీ అరేబియా 2024.. 30శాతం పెరిగిన సందర్శకులు..!!

- November 28, 2024 , by Maagulf
జ్యువెలరీ అరేబియా 2024.. 30శాతం పెరిగిన సందర్శకులు..!!

మనామా: జ్యువెలరీ అరేబియా 2024 సక్సెస్ అయింది. గత సంవత్సరంతో పోలిస్తే 30% సందర్శకులు పెరిగారని బహ్రెయిన్ ఆభరణాల వ్యాపారులు వెల్లడించారు.  బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ చైర్‌పర్సన్ సారా అహ్మద్ బుహిజీ మాట్లాడుతూ.. జ్యువెలరీ అరేబియా ఈవెంట్ సక్సెస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు.  "ఈ ఏడాది ఎక్కువ మంది బహ్రెయిన్ ఆభరణాలు తమ ప్రత్యేకమైన డిజైన్‌లను ప్రదర్శిస్తున్నాం. వీటిలో చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షించే ఐకానిక్ బహ్రెయిన్ ముత్యాలు ఉన్నాయి." అని బుహిజీ చెప్పారు.

ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లోని మొత్తం ఏడు హాల్‌లలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. "బహ్రెయిన్‌కు ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌లను తీసుకురావడానికి, గ్లోబల్ ఎగ్జిబిషన్స్ హబ్‌గా ఖ్యాతిని పటిష్టం చేయడానికి ఇన్‌ఫార్మా మార్కెట్స్ వంటి ప్రైవేట్ రంగ భాగస్వాములతో కలిసి పని చేయడం మాకు గర్వకారణం." అని బుహిజీ జోడించారు.

ఇన్ఫార్మా మార్కెట్స్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 27 దేశాల నుండి 700 మందికి పైగా ఎగ్జిబిటర్లు, గత సంవత్సరంతో పోలిస్తే ప్రారంభ రోజు సందర్శకుల సంఖ్య గణనీయంగా 33% పెరిగిందన్నారు.  ఈ విజయానికి బహ్రెయిన్ అత్యాధునిక మౌలిక సదుపాయాలే కారణమని అన్నారు.

ఈ సంవత్సరం జ్యువెలరీ అరేబియా సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి యాప్‌ను కూడా పరిచయం చేసింది. "యాప్ షెడ్యూల్‌లు, అప్‌డేట్‌లు, ప్రత్యేక ఆఫర్‌లను ఒకే చోట చూపెడుతుంది. దీంతో సందర్శకులు మెరుగైన అనుభవాన్ని పొందుతున్నారని ఇబ్రహీం తెలిపారు. యాప్ డౌన్‌లోడ్‌లు గత సంవత్సరంతో పోలిస్తే 80% పెరిగాయని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com