యూఏఈ నేషనల్ డే..4,500 మందికి పైగా ఖైదీలు విడుదల..!!
- November 28, 2024
యూఏఈం 53వ నేషనల్ డే సందర్భంగా 4,500 మందికి పైగా ఖైదీలను యూఏఈ విడుదల చేయనుంది. ఇందులో 2,269 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ఆదేశించారు.అదే సమయంలో వివిధ రకాల నేరాలకు శిక్ష పడిన ఖైదీలకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేయనున్నారు. విడుదలైన ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, వారి కుటుంబాలలో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు వివిధ దేశాలకు చెందిన 1,169 మంది ఖైదీలను విడుదల చేయాలని, వీలైనంత త్వరగా ఆర్డర్ను అమలు చేయాలని అధికారులను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. యూఏఈ 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా 683 మంది ఖైదీలను విడుదల చేయాలని అంతకుముందు షార్జా పాలకుడు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, అజ్మాన్ పాలకుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి కూడా 304 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్-షార్కీ కూడా 118 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







