యూఏఈ నేషనల్ డే..4,500 మందికి పైగా ఖైదీలు విడుదల..!!

- November 28, 2024 , by Maagulf
యూఏఈ నేషనల్ డే..4,500 మందికి పైగా ఖైదీలు విడుదల..!!

యూఏఈం 53వ నేషనల్ డే సందర్భంగా 4,500 మందికి పైగా ఖైదీలను యూఏఈ విడుదల చేయనుంది. ఇందులో 2,269 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ఆదేశించారు.అదే సమయంలో వివిధ రకాల నేరాలకు శిక్ష పడిన ఖైదీలకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేయనున్నారు. విడుదలైన ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, వారి కుటుంబాలలో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరోవైపు  వివిధ దేశాలకు చెందిన 1,169 మంది ఖైదీలను విడుదల చేయాలని, వీలైనంత త్వరగా ఆర్డర్‌ను అమలు చేయాలని అధికారులను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు.  యూఏఈ 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా 683 మంది ఖైదీలను విడుదల చేయాలని అంతకుముందు షార్జా పాలకుడు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, అజ్మాన్ పాలకుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి కూడా 304 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్-షార్కీ కూడా 118 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com