యూఏఈ నేషనల్ డే..4,500 మందికి పైగా ఖైదీలు విడుదల..!!
- November 28, 2024
యూఏఈం 53వ నేషనల్ డే సందర్భంగా 4,500 మందికి పైగా ఖైదీలను యూఏఈ విడుదల చేయనుంది. ఇందులో 2,269 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ఆదేశించారు.అదే సమయంలో వివిధ రకాల నేరాలకు శిక్ష పడిన ఖైదీలకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేయనున్నారు. విడుదలైన ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, వారి కుటుంబాలలో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు వివిధ దేశాలకు చెందిన 1,169 మంది ఖైదీలను విడుదల చేయాలని, వీలైనంత త్వరగా ఆర్డర్ను అమలు చేయాలని అధికారులను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. యూఏఈ 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా 683 మంది ఖైదీలను విడుదల చేయాలని అంతకుముందు షార్జా పాలకుడు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, అజ్మాన్ పాలకుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి కూడా 304 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్-షార్కీ కూడా 118 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







