కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. జైలుశిక్షతోపాటు భారీగా జరిమానాలు..!!
- November 28, 2024
కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టానికి సంబంధించి డిక్రీ త్వరలో జారీ చేయనున్నారు. గత నెలలో ట్రాఫిక్ వ్యవహారాలు కార్యకలాపాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా ఓ ఇంటర్వ్యూలో కొత్త ట్రాఫిక్ చట్టం గురించి కొన్ని వివరాలను అందించారు. దీని ప్రకారం, నిషేధిత ప్రాంతాలలో పార్కింగ్ కు ఉన్న KD 5ను KD 15కు పెంచారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైతే అతిపెద్ద జరిమానా KD 5,000 గా నిర్ణయించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడితే జరిమానా KD 5 నుండి KD 75 కి, సీట్ బెల్ట్ పెట్టుకొనందుకు జరిమానాను KD 10 నుండి KD 30కి పొడిగించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్కు KD 150, రెడ్లైట్ని జంప్ KD 150కి మూడు రెట్లు పెంచారు. వికలాంగుల కోసం స్థలాలలో పార్కింగ్ చేస్తే KD 150కి జరిమానాను పెంచారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి 3వే దిర్హామ్స్ తో రెండేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తిని ధ్వంసం చేస్తే KD3 వేల దిర్హాంతోపాటు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







