కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. జైలుశిక్షతోపాటు భారీగా జరిమానాలు..!!
- November 28, 2024
కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టానికి సంబంధించి డిక్రీ త్వరలో జారీ చేయనున్నారు. గత నెలలో ట్రాఫిక్ వ్యవహారాలు కార్యకలాపాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా ఓ ఇంటర్వ్యూలో కొత్త ట్రాఫిక్ చట్టం గురించి కొన్ని వివరాలను అందించారు. దీని ప్రకారం, నిషేధిత ప్రాంతాలలో పార్కింగ్ కు ఉన్న KD 5ను KD 15కు పెంచారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైతే అతిపెద్ద జరిమానా KD 5,000 గా నిర్ణయించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడితే జరిమానా KD 5 నుండి KD 75 కి, సీట్ బెల్ట్ పెట్టుకొనందుకు జరిమానాను KD 10 నుండి KD 30కి పొడిగించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్కు KD 150, రెడ్లైట్ని జంప్ KD 150కి మూడు రెట్లు పెంచారు. వికలాంగుల కోసం స్థలాలలో పార్కింగ్ చేస్తే KD 150కి జరిమానాను పెంచారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి 3వే దిర్హామ్స్ తో రెండేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తిని ధ్వంసం చేస్తే KD3 వేల దిర్హాంతోపాటు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









