కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. జైలుశిక్షతోపాటు భారీగా జరిమానాలు..!!
- November 28, 2024
కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టానికి సంబంధించి డిక్రీ త్వరలో జారీ చేయనున్నారు. గత నెలలో ట్రాఫిక్ వ్యవహారాలు కార్యకలాపాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా ఓ ఇంటర్వ్యూలో కొత్త ట్రాఫిక్ చట్టం గురించి కొన్ని వివరాలను అందించారు. దీని ప్రకారం, నిషేధిత ప్రాంతాలలో పార్కింగ్ కు ఉన్న KD 5ను KD 15కు పెంచారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైతే అతిపెద్ద జరిమానా KD 5,000 గా నిర్ణయించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడితే జరిమానా KD 5 నుండి KD 75 కి, సీట్ బెల్ట్ పెట్టుకొనందుకు జరిమానాను KD 10 నుండి KD 30కి పొడిగించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్కు KD 150, రెడ్లైట్ని జంప్ KD 150కి మూడు రెట్లు పెంచారు. వికలాంగుల కోసం స్థలాలలో పార్కింగ్ చేస్తే KD 150కి జరిమానాను పెంచారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి 3వే దిర్హామ్స్ తో రెండేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తిని ధ్వంసం చేస్తే KD3 వేల దిర్హాంతోపాటు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







