దుబాయ్ లో కొత్త మ్యూజియం..ఫోటోగ్రఫీకి ప్రత్యేకం..!!
- November 28, 2024
యూఏఈ: దుబాయ్ లో ఇప్పుడు మరో కొత్త ఆకర్షణ వచ్చి చేరింది. ఫోటోగ్రఫీకి ప్రత్యేకమైన మ్యూజియం ప్రారంభమైంది. దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) ఛైర్పర్సన్ షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్ ఫోటోగ్రఫీ మ్యూజియం ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఇది ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీ చరిత్రను తెలిపేలా డిజైన్ చేశారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుడి సేకరించిన అనేక ఫోటో ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. దుబాయ్ ఫోటోగ్రఫీ మ్యూజియం ఒక గొప్ప మైలురాయి, ఇది ప్రతిభకు గ్లోబల్ హబ్గా ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లకు ప్రధాన గమ్యస్థానంగా ఎమిరేట్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని షేఖా లతీఫా అన్నారు.
2027 నాటికి గ్లోబల్ ఫోటోగ్రఫీ మార్కెట్ $62.4 బిలియన్లకు చేరుకుంటుందని, ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తుందని భావిస్తున్నరు. ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం విద్యా పరమైన కోర్సులు, వర్క్షాప్లను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఒకచోటకు మ్యూజియం చేర్చనున్నది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







