దుబాయ్ లో కొత్త మ్యూజియం..ఫోటోగ్రఫీకి ప్రత్యేకం..!!
- November 28, 2024
యూఏఈ: దుబాయ్ లో ఇప్పుడు మరో కొత్త ఆకర్షణ వచ్చి చేరింది. ఫోటోగ్రఫీకి ప్రత్యేకమైన మ్యూజియం ప్రారంభమైంది. దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) ఛైర్పర్సన్ షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్ ఫోటోగ్రఫీ మ్యూజియం ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఇది ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీ చరిత్రను తెలిపేలా డిజైన్ చేశారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుడి సేకరించిన అనేక ఫోటో ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. దుబాయ్ ఫోటోగ్రఫీ మ్యూజియం ఒక గొప్ప మైలురాయి, ఇది ప్రతిభకు గ్లోబల్ హబ్గా ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లకు ప్రధాన గమ్యస్థానంగా ఎమిరేట్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని షేఖా లతీఫా అన్నారు.
2027 నాటికి గ్లోబల్ ఫోటోగ్రఫీ మార్కెట్ $62.4 బిలియన్లకు చేరుకుంటుందని, ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తుందని భావిస్తున్నరు. ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం విద్యా పరమైన కోర్సులు, వర్క్షాప్లను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఒకచోటకు మ్యూజియం చేర్చనున్నది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









