మహారాష్ట్ర: బస్సు బోల్తా..10 మంది మృతి
- November 29, 2024
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడి 10మంది మృతిచెందారు.ఈ ఘటనలో దాదాపు మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బోల్తా పడి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని బింద్రవాన తోల గ్రామానికి సమీపంలో కోహ్మరా స్టేట్ హైవేపై ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఇక ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారని గోండియా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు గోండియా పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







