మహారాష్ట్ర: బస్సు బోల్తా..10 మంది మృతి
- November 29, 2024
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడి 10మంది మృతిచెందారు.ఈ ఘటనలో దాదాపు మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బోల్తా పడి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని బింద్రవాన తోల గ్రామానికి సమీపంలో కోహ్మరా స్టేట్ హైవేపై ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఇక ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారని గోండియా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు గోండియా పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!