రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- March 10, 2026
మనామా: నిందితులు శత్రువుతో కలిసి కుట్ర పన్నారని, ఇది దేశద్రోహానికి సమానమని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలియజేసింది. బహ్రెయిన్పై ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రాసిక్యూషన్ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కొందరు ఇరాన్ పక్షాన నిలిచి బహ్రెయిన్కు ద్రోహం చేశారని, రాజ్యానికి వ్యతిరేకంగా శత్రువ చర్యలకు మద్దతుగా నిలిచారని, ఉగ్రవాద సంస్థగా పేర్కొన్న దానితో సంబంధాలు ఏర్పరచుకున్నారని పేర్కొన్నది.
దేశానికి సంబంధించిన రక్షణ రహస్యాన్ని తెలియజేసే లక్ష్యంతో, ఫోటోగ్రఫీ నిషేధించబడిన ప్రదేశాలో వీడియోలు, ఫోటోలను తీసినట్టు నిందితులపై ఆరోపణలు ఉన్నాయని కూడా కోర్టుకు తెలిపింది.
బహ్రెయిన్ భద్రత మరియు సార్వభౌమాధికారం అన్నింటికంటే ఉన్నతమైనదని, దేశం పట్ల విధేయతకు సంబంధించిన విషయం కాదని ఈ కేసు చెబుతుందని ప్రాసిక్యూషన్ పేర్కొంది. చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్షను విధించాలని కోరింది.
దేశ భద్రతను పణంగా పెట్టి, ద్రోహులతో చేతులు కలిపే ఎవరికైనా చట్టం ఒకేలా ఉంటుందని స్పష్టం చేసింది. బహ్రెయిన్ సార్వభౌమాధికారం మరియు భద్రతకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారందరికీ ఈ కేసు ఒక హెచ్చరిక కావాలని ప్రాసిక్యూషన్ తన వాదనలను ముగిసింది.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









