మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- March 10, 2026
యూఏఈః మిడిలీస్టులో యుద్ధం ప్రారంభం నుంచి 40వేలకు పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఈ మేరకు ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియం డేటా తెలిపింది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 9 వరకు 72వేలకకి పైగా విమానాలు షెడ్యూల్ కాగా, అందులో 40 వేలకి పైగా విమానాలు రద్దయ్యాయి.
ఇరానియన్ క్షిపణులు మరియు డ్రోన్ల బారిన పడి యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలలోని విమానయాన సంస్థలు కొన్ని రోజుల సస్పెన్షన్ల తర్వాత పాక్షికంగా తిరిగి కార్యకలాపాలను ఇటీవల ప్రారంభించాయి. యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలు పరిమిత విమానాలను నడపడానికి ఎయిర్ కారిడార్ను ఏర్పాటు చేశాయి.
ఫిచ్ రేటింగ్స్ ప్రకారం, ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా ప్రారంభించిన దాడుల తర్వాత విమానయాన రంగం పూర్తిగా కుదైలైంది. విమానయాన సంస్థలతోపాటు విమానాశ్రయాలు, హోటల్స్, ఇన్సూరెన్స్ మరియు రియల్ ఏస్టేట్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విమానాలు నడపకపోవడం వల్ల విమానయాన సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







