మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- March 10, 2026
యూఏఈః మిడిలీస్టులో యుద్ధం ప్రారంభం నుంచి 40వేలకు పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఈ మేరకు ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియం డేటా తెలిపింది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 9 వరకు 72వేలకకి పైగా విమానాలు షెడ్యూల్ కాగా, అందులో 40 వేలకి పైగా విమానాలు రద్దయ్యాయి.
ఇరానియన్ క్షిపణులు మరియు డ్రోన్ల బారిన పడి యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలలోని విమానయాన సంస్థలు కొన్ని రోజుల సస్పెన్షన్ల తర్వాత పాక్షికంగా తిరిగి కార్యకలాపాలను ఇటీవల ప్రారంభించాయి. యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలు పరిమిత విమానాలను నడపడానికి ఎయిర్ కారిడార్ను ఏర్పాటు చేశాయి.
ఫిచ్ రేటింగ్స్ ప్రకారం, ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా ప్రారంభించిన దాడుల తర్వాత విమానయాన రంగం పూర్తిగా కుదైలైంది. విమానయాన సంస్థలతోపాటు విమానాశ్రయాలు, హోటల్స్, ఇన్సూరెన్స్ మరియు రియల్ ఏస్టేట్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విమానాలు నడపకపోవడం వల్ల విమానయాన సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









