మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- March 10, 2026
యూఏఈః మిడిలీస్టులో యుద్ధం ప్రారంభం నుంచి 40వేలకు పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఈ మేరకు ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియం డేటా తెలిపింది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 9 వరకు 72వేలకకి పైగా విమానాలు షెడ్యూల్ కాగా, అందులో 40 వేలకి పైగా విమానాలు రద్దయ్యాయి.
ఇరానియన్ క్షిపణులు మరియు డ్రోన్ల బారిన పడి యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలలోని విమానయాన సంస్థలు కొన్ని రోజుల సస్పెన్షన్ల తర్వాత పాక్షికంగా తిరిగి కార్యకలాపాలను ఇటీవల ప్రారంభించాయి. యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలు పరిమిత విమానాలను నడపడానికి ఎయిర్ కారిడార్ను ఏర్పాటు చేశాయి.
ఫిచ్ రేటింగ్స్ ప్రకారం, ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా ప్రారంభించిన దాడుల తర్వాత విమానయాన రంగం పూర్తిగా కుదైలైంది. విమానయాన సంస్థలతోపాటు విమానాశ్రయాలు, హోటల్స్, ఇన్సూరెన్స్ మరియు రియల్ ఏస్టేట్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విమానాలు నడపకపోవడం వల్ల విమానయాన సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









