సౌదీలో 164 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్..!!
- December 03, 2024
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలపై నాలుగు మంత్రిత్వ శాఖలకు చెందిన 164 మంది ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో హోం, హెల్త్, ఎడ్యుకేషన్, మునిసిపాలిటీ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారందరూ లంచం, కార్యాలయ దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నజాహా అధికారులు నవంబర్ నెలలో 1635 తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించారు. అవినీతి, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను నమోదు చేసినట్లు, 370 మంది ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







