సౌదీలో 164 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్..!!
- December 03, 2024
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలపై నాలుగు మంత్రిత్వ శాఖలకు చెందిన 164 మంది ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో హోం, హెల్త్, ఎడ్యుకేషన్, మునిసిపాలిటీ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారందరూ లంచం, కార్యాలయ దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నజాహా అధికారులు నవంబర్ నెలలో 1635 తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించారు. అవినీతి, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను నమోదు చేసినట్లు, 370 మంది ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









