కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసిన ఏపీ మంత్రి వర్గం
- December 03, 2024
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీర్ ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారుల్ని నిలదీశారు.
ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ టాక్ ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బ్యూరోక్రసీ డిలే వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని చంద్రబాబు చెప్పారు.
జేజేఎం ప్రతి ఒక్కరికీ రీచ్ అయ్యే అతి పెద్ద ప్రాజెక్టని లోకేశ్ అన్నారు. పథకాలు సక్రమ వినియోగం పై అధికారులు దృష్టి పెట్టాలని గట్టిగా చెప్పారు సీఎం చంద్రబాబు. పులివెందుల, ఉద్దానం, డోన్ లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల విజిబిలిటీ పెరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
డిసెంబర్ 12న ప్రభుత్వం ఏర్పడి 6నెలలు పూర్తవుతుంది కాబట్టి ఎవరేం చేశారో సమగ్ర నివేదిక ఇస్తే స్ట్రీమ్ లైన్ చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియాలను అరికట్టామని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవీ పరిష్కరిస్తామని చెప్పారు. రేషన్ మాఫియాను అరికడుతున్నాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలూ పరిష్కరిస్తున్నామని అన్నారు.
డిసెంబర్ 15వ తేదీన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయం చెప్పారు. ఐటీ, టెక్స్టైల్, మారీటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపారు. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు ఆమోదం పడింది. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోద ముద్ర పడింది.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









