తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే పిటిషన్ వేశారు-రజనీ
- July 08, 2015
తన అల్లుడి తండ్రి తీసుకున్న 65 లక్షల రూపాయల అప్పుకు తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేశారు. తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఈ కేసులో తనపై పిటిషన్ వేశారని ఆయన తెలిపారు. 2012లో రజనీకాంత్ అల్లుడి తండ్రి కస్తూరి రాజా ఓ ఫైనాన్షియర్ దగ్గర నుంచి 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తాను అప్పు తీర్చకపోతే రజనీకాంత్ తీరుస్తాడని ఫైనాన్షియర్ను నమ్మించాడు. కస్తూరి రాజా అప్పు తీర్చకపోవడంతో ఫైనాన్షియర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయమూర్తి రవిచంద్రబాబు ఈ నెల 22న కస్తూరి రాజాకు, రజనీకాంత్కు నోటీసులు జారీ చేశారు. కోర్టుకు హాజరైన రజనీకాంత్ తన పేరు వాడుకుని డబ్బులు తీసుకుంటే తానెలా బాధ్యుడవునతానని వాదించారు. తాను ఎవరినుంచీ అప్పు తీసుకోలేదని, ఎవరికీ గ్యారంటీ కూడా ఇవ్వలేదని కుండబద్దలు కొట్టారు. తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే తనను ఈ కేసులోకి బలవంతంగా లాగారని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









