తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే పిటిషన్ వేశారు-రజనీ
- July 08, 2015
తన అల్లుడి తండ్రి తీసుకున్న 65 లక్షల రూపాయల అప్పుకు తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేశారు. తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఈ కేసులో తనపై పిటిషన్ వేశారని ఆయన తెలిపారు. 2012లో రజనీకాంత్ అల్లుడి తండ్రి కస్తూరి రాజా ఓ ఫైనాన్షియర్ దగ్గర నుంచి 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తాను అప్పు తీర్చకపోతే రజనీకాంత్ తీరుస్తాడని ఫైనాన్షియర్ను నమ్మించాడు. కస్తూరి రాజా అప్పు తీర్చకపోవడంతో ఫైనాన్షియర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయమూర్తి రవిచంద్రబాబు ఈ నెల 22న కస్తూరి రాజాకు, రజనీకాంత్కు నోటీసులు జారీ చేశారు. కోర్టుకు హాజరైన రజనీకాంత్ తన పేరు వాడుకుని డబ్బులు తీసుకుంటే తానెలా బాధ్యుడవునతానని వాదించారు. తాను ఎవరినుంచీ అప్పు తీసుకోలేదని, ఎవరికీ గ్యారంటీ కూడా ఇవ్వలేదని కుండబద్దలు కొట్టారు. తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే తనను ఈ కేసులోకి బలవంతంగా లాగారని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







