ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా
- December 09, 2024
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ కొత్త గవర్నర్గా 1990 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నియమితులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ) పదవిని నిర్వహిస్తున్నారు. అంతకుముందు తన మునుపటి పదవిలో ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. దీంతోపాటు ఆయనకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ఆర్థిక, పన్నుల రంగంలో మంచి అనుభవం ఉంది.
ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్కి రేపు చివరి రోజు. ఆ తర్వాత బుధవారం నుంచి కొత్త ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సంజయ్ మల్హోత్రా మూడేళ్లపాటు నియమితులయ్యారు. మల్హోత్రా నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంజయ్ రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







