తెలంగాణలో రాష్ట్రపతి ఐదురోజుల పర్యటన

- December 10, 2024 , by Maagulf
తెలంగాణలో రాష్ట్రపతి ఐదురోజుల పర్యటన

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఇవాళ సచివాలయంలో సమీక్షించారు.

పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము ఈ నెల 17 నుంచి (21 వరకు) ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారని… ఈ మేర‌కు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆయన చేస్తారని సిఎస్ తెలిపారు.

రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తగురీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com