హాస్పిటాలిటీ రంగంలో 22% ప్రభుత్వ రుసుములు తగ్గింపు..!!
- December 11, 2024
బురైదా: సౌదీ టూరిజం ఇన్వెస్ట్మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం హాస్పిటాలిటీ రంగంలో ప్రభుత్వ రుసుములను 22 శాతం తగ్గించేందుకు పని చేస్తుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. అల్-ఖాసిమ్ ప్రాంతంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలను అల్-ఖతీబ్ వెల్లడించారు.టూరిజం ఇన్వెస్ట్మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం అనేది పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు ప్రోత్సహించడానికి రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.
అల్-ఖతీబ్ అల్-ఖాసిమ్ రాజ్యంలో అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి అని, దాని సహజ వైవిధ్యం, చారిత్రక వారసత్వ చరిత్ర కారణంగా పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడం మంత్రిత్వ శాఖ చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటని మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







