హాస్పిటాలిటీ రంగంలో 22% ప్రభుత్వ రుసుములు తగ్గింపు..!!
- December 11, 2024
బురైదా: సౌదీ టూరిజం ఇన్వెస్ట్మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం హాస్పిటాలిటీ రంగంలో ప్రభుత్వ రుసుములను 22 శాతం తగ్గించేందుకు పని చేస్తుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. అల్-ఖాసిమ్ ప్రాంతంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలను అల్-ఖతీబ్ వెల్లడించారు.టూరిజం ఇన్వెస్ట్మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం అనేది పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు ప్రోత్సహించడానికి రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.
అల్-ఖతీబ్ అల్-ఖాసిమ్ రాజ్యంలో అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి అని, దాని సహజ వైవిధ్యం, చారిత్రక వారసత్వ చరిత్ర కారణంగా పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడం మంత్రిత్వ శాఖ చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటని మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









