పార్కింగ్ వద్ద గొడవ.. భారతీయ వ్యక్తిపై దాడి..వ్యక్తికి జైలు, బహిష్కరణ వేటు..!!
- December 13, 2024
యూఏఈ: దుబాయ్లో పార్కింగ్ స్థలం వద్ద ఘర్షణ సందర్భంగా 34 ఏళ్ల భారతీయ వ్యక్తికి శాశ్వత వైకల్యానికి కారణమైన 70 ఏళ్ల పాకిస్తాన్ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష ముగిసిన తర్వాత ఆ వ్యక్తిని కూడా బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరి 8న ఎమిరేట్స్ టెకామ్ ప్రాంతంలోని నివాస భవనం వెలుపల పార్కింగ్ స్థలం వద్ద జరిగింది.
కోర్టు పత్రాల ప్రకారం.. పాకిస్తానీ వ్యక్తి భారతీయ వ్యక్తి ఉపయోగించిన పార్కింగ్ స్థలాన్ని క్లెయిమ్ చేయడంతో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పాకిస్తానీ వ్యక్తి బలవంతంగా నెట్టడంతో భారతీయ వ్యక్తి నేలపై పడి గణనీయమైన గాయాలకు గురయ్యాడు. ఇందులో నరాల దెబ్బతినడం, కండరాల క్షీణత, 50 శాతం కాలు పనిచేయకుండా పోయింది. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ పాకిస్తానీ వ్యక్తి నేరాన్ని నిర్ధారించింది.కాగా, ఇదే కేసులో 34 ఏళ్ల భారతీయ వ్యక్తిపై నమోదైన కేసు తదుపరి విచారణ కోసం మిస్డిమినర్ కోర్టుకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









