జార్జియా: హోటల్ బెడ్రూమ్లో విగతజీవులుగా 12 మంది భారతీయులు
- December 16, 2024
జార్జియా: జార్జియాలోని గూడౌరి మౌంటైన్ రిసార్ట్లోని ఓ రెస్టారెంట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్లో కార్బన్ మోనాక్సైడ్ విడుదలై 12 మంది చనిపోయారు. చనిపోయిన 12 మందిలో 11 మంది భారతీయులేనని టిబిలిసిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రాథమిక పరీక్షలో చనిపోయినవారి శరీరాల పై గాయాలు ఏం లేవని జార్జియా దేశీయాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మృతులంతా అదే ఇండియన్ రెస్టారెంట్ ఉద్యోగులుగా గుర్తించారు.
బెడ్రూమ్ల దగ్గర ఉన్న పవర్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవ్వడం వల్లే వారంతా చనిపోయారని ప్రాథమిక నివేదికల్లో తెలిసింది.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు ఫోరెన్సిక్ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







