ధనుర్వాతానికి టీకా తప్పనిసరి
- July 08, 2015
చాలామంది తుప్పు పట్టిన మేకులు, ఇనుప ముక్కలు గుచ్చుకోవడం వల్లనే సెప్టిక్ అయ్యి, తద్వారా ధనుర్వాతంలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. కానీ నిజానికి ధనుర్వాతం కలిగించే బాక్టీరియా సిద్ధబీజాలు మట్టి, దుమ్ము, ధూళి ఇలా ఎక్కడైనా ఉండొచ్చు. కీటకాలు, కుక్కకాట్లు లేదా ఇతర జంతువుల్లాంటివి కరవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణుల ద్వారా వెల్లడైన విషయం. శరీరం మీద ఎక్కడైనా గాయంలాంటివి అయినపుడు ఈ వ్యాధిని కల్గించే సూక్ష్మజీవులు చర్మం ద్వారా రక్తంలోనికి ప్రవేశించి, తద్వారా వెన్నుపాము, మెదడుకు వ్యాపిస్తాయి. ఇలా చూస్తుండగానే వ్యాధి కొన్ని రోజుల్లోనే తీవ్ర రూపం దాల్చుతుంది. మెడ బిగుసుకుపోవడం, మింగడానికి కష్టమవడం, కడుపు బల్లలాగా మారిపోవడంలాంటివి ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ వ్యాధి ఒక్కసారి సంక్రమించినాక నియంత్రించడం అసాధ్యం. అందుకే ప్రపంచ ఆరోగ్య శాఖ వారు ఈ వ్యాధికి సంబంధించిన టీకాలను అందుబాటులోకి తీసుకురావడంతో దీన్ని కొంతవరకూ నియంత్రించడం జరుగుతుంది. అయితే ప్రతీ పదేళ్లకోసారి ఖచ్చితంగా ఈ టీకా ను వేయించుకోవాలి. కొన్ని సమయాల్లో పెద్ద పెద్ద గాయాలే కాకుండా, పెంపుడు జంతువులు కరవడం, కొన్ని రకాల కీటకాల కాట్లు వంటి వాటి ద్వారా కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందుకే తప్పనిసరిగా ఈ టీకాని తీసుకోవడం మేలని వైద్యుల సలహా.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







