దుబాయ్ లో 17 వాహనాలు సీజ్..101 జరిమానాలు జారీ..!!
- December 18, 2024
దుబాయ్: అల్ మైదాన్ స్ట్రీట్లో నిర్లక్ష్యంగా, ఇతరులకు ఇబ్బందులు లిగించే ప్రవర్తనకు పాల్పడిన డ్రైవర్లపై దుబాయ్ పోలీసులు కొరడా ఝులిపించారు. గత వారం 17 వాహనాలను స్వాధీనం చేసుకొని 101 జరిమానాలు జారీ చేశారు. చట్టవిరుద్ధంగా వాహనాల వినియోగం, అధిక శబ్దం సృష్టించడం, ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల వారితోపాటు ఇతరకుల భద్రతకు ప్రమాదం ఉందని అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి తెలిపారు. జప్తు చేయబడిన వాహనాలు ఫెడరల్ ట్రాఫిక్, రోడ్స్ చట్టంలో పేర్కొన్న జరిమానాలతో పాటు నేరం తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని అల్ మజ్రోయీ వివరించారు.
వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన 2023 డిక్రీ నెం. 30 ప్రకారం, ఉల్లంఘించినవారు Dh50,000 వరకు విడుదల రుసుము చెల్లించవలసి ఉంటుందని అల్ మజ్రోయి చెప్పారు. బాధ్యతా రహితమైన డ్రైవింగ్ పద్ధతులకు వ్యతిరేకంగా దుబాయ్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారని, అయినా కొందరిలో మార్పులు రావడం లేదని అన్నారు. కొంతమంది డ్రైవర్లు అటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంటారని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్లో అందుబాటులో ఉన్న "పోలీస్ ఐ" సేవ ద్వారా లేదా "వి ఆర్ ఆల్ పోలీస్" హాట్లైన్ 901కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదులు చేసి దుబాయ్ పోలీసులకు సహకరించాలని అల్ మజ్రూయి ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







