జైపూర్ ట్యాంకర్ పేలుడులో 14కు పెరిగిన మృతుల సంఖ్య
- December 21, 2024
జైపూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఉదయానికి మృతుల సంఖ్య 14కి చేరినట్లు డీసీపీ అమిత్ కుమార్ తెలిపారు.
శుక్రవారం ఉదయం జైపూర్-అజ్మీర్ రహదారిలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్కును ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 37 వాహనాలు మంటల్లో కాలిపోయాయి.
30 మంది పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో 80 మందికిపైగా గాయపడ్డారు. అందులో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నమన్నారు. మరోవైపు చనిపోయినవారి కుటుంబాలకు రాజస్థాన్ సర్కారు రూ.5 లక్షలు, ప్రధాని తన జాతీయ సహాయ నిధి తరపున రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాయి. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష, ప్రధాని సహాయ నిధి రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని తెలిపాయి. ఈ ప్రమాదం చాల బాధాకరమని మోడీ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









