దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- June 23, 2026
దుబాయ్: అద్దెదారుల పై ఆర్థిక భారం తగ్గించేందుకు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ (DLD) కొత్తగా ‘ఫ్లెక్సీ రెంట్’ (Flexi Rent) పేరుతో వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అద్దెదారులు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక చెల్లింపు విధానాలను ఎంచుకునే అవకాశం పొందనున్నారు.
దుబాయ్లోని భాగస్వామ్య రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా ఇళ్లు అద్దెకు తీసుకునే నివాసితులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. పెద్ద మొత్తంలో ఒకేసారి అద్దె చెల్లించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ, అద్దె చెల్లింపుల్లో మరింత సౌలభ్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.
డీఎల్డీ అద్దె వ్యవహారాల విభాగం డైరెక్టర్ ఖలీద్ అల్ షైబానీ మాట్లాడుతూ, నివాసితులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించి, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.
ప్రారంభ దశలో ఈ పథకంలో దుబాయ్కు చెందిన 12 రియల్ ఎస్టేట్ డెవలపర్లు భాగస్వాములుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సంస్థలను ఇందులో చేర్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అద్దెదారులు మరియు రియల్ ఎస్టేట్ సంస్థలు పరస్పర అంగీకారంతో చెల్లింపు విధానాలను రూపొందించుకోవచ్చని, అవసరమైతే వాయిదా సదుపాయాలు, గ్రేస్ పీరియడ్లు, చెల్లింపు షెడ్యూల్లో మార్పులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అద్దె పెంపును తాత్కాలికంగా నిలిపివేయడం వంటి అవకాశాలు కూడా ఉండవచ్చని తెలిపారు.
ఈ పథకం కింద క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లేదా చెక్కుల ద్వారా చెల్లింపులు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నాలుగు చెక్కుల ద్వారా అద్దె చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్న వారికి, ఈ పథకంలో మార్పులు చేసుకునే సందర్భంలో సాధారణంగా విధించే అదనపు రుసుమును మినహాయించనున్నట్లు తెలిపారు.
ఫ్లెక్సీ రెంట్ పథకం కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని సరసమైన అద్దె పథకాలు, వినూత్న రియల్ ఎస్టేట్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు డీఎల్డీ స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది అద్దెదారులు ప్రయోజనం పొందడంతో పాటు, దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో మరింత స్థిరత్వం, వినియోగదారుల అనుకూలత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







