అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- June 23, 2026
కువైట్: ప్రవాస కార్మికులు నమోదు చేసుకున్న విద్యా అర్హతలు మరియు వృత్తులను సవరించుకోవడానికి అనుమతించే కొత్త నిబంధనలను కువైట్ ప్రవేశపెట్టింది. ఫస్ట్ ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ అయిన షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
కార్మికుల ధృవపత్రాలు మరియు ఉద్యోగానికి అనుకూలంగా ఉన్నట్లయితే, వారి విద్యా అర్హతలు లేదా వృత్తిపరమైన హోదాలలో మార్పులను ఈ సర్క్యులర్ అనుమతిస్తుంది. నమోదైన అర్హతలకు, ఉద్యోగులు కార్యాలయంలో నిర్వర్తించే విధులకు మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్లోని వర్గాలు తెలిపాయి. డైరెక్టర్-జనరల్ ఇంజనీర్ రబాబ్ అల్-ఒసైమీ నేతృత్వంలో లేబర్ ఇండస్ట్రిని నియంత్రించడానికి, యజమానులు-కార్మికుల హక్కుల మధ్య సమతుల్యం పాటిస్తూనే వివిధ ఆర్థిక రంగాల వాస్తవ అవసరాలను పెంపొందించడంలో ఈ నిర్ణయం ఒక భాగమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొత్త నిబంధనలు జూన్ 2 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







