అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- June 23, 2026
కువైట్: ప్రవాస కార్మికులు నమోదు చేసుకున్న విద్యా అర్హతలు మరియు వృత్తులను సవరించుకోవడానికి అనుమతించే కొత్త నిబంధనలను కువైట్ ప్రవేశపెట్టింది. ఫస్ట్ ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ అయిన షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
కార్మికుల ధృవపత్రాలు మరియు ఉద్యోగానికి అనుకూలంగా ఉన్నట్లయితే, వారి విద్యా అర్హతలు లేదా వృత్తిపరమైన హోదాలలో మార్పులను ఈ సర్క్యులర్ అనుమతిస్తుంది. నమోదైన అర్హతలకు, ఉద్యోగులు కార్యాలయంలో నిర్వర్తించే విధులకు మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్లోని వర్గాలు తెలిపాయి. డైరెక్టర్-జనరల్ ఇంజనీర్ రబాబ్ అల్-ఒసైమీ నేతృత్వంలో లేబర్ ఇండస్ట్రిని నియంత్రించడానికి, యజమానులు-కార్మికుల హక్కుల మధ్య సమతుల్యం పాటిస్తూనే వివిధ ఆర్థిక రంగాల వాస్తవ అవసరాలను పెంపొందించడంలో ఈ నిర్ణయం ఒక భాగమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొత్త నిబంధనలు జూన్ 2 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







