తాజ్ మహల్ రికార్డ్ బ్రేక్ చేసిన అయోధ్య రామ్ మందిర్

- December 23, 2024 , by Maagulf
తాజ్ మహల్ రికార్డ్ బ్రేక్ చేసిన అయోధ్య రామ్ మందిర్

ప్రపంచ వింత తాజ్‌మహల్‌ రికార్డును అయోధ్య రామ మందిరం బద్దలుకొట్టింది. 2024, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది భారతీయులు అయోధ్యను సందర్శించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు 3 వేల 153 మంది విదేశీ పర్యాటకులు అయోధ్య సందర్శించారు.అటు తాజ్‌మహల్‌ను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించారు. కేవలం 9 నెలల్లోనే తాజ్‌మహల్‌ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com