'గరివిడి లక్ష్మి' టైటిల్ తో సినిమా గ్రాండ్ గా లాంచ్
- December 23, 2024
పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రలకు డెప్త్ ని తెచ్చే హీరోయిన్ ఆనంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించే కొత్త, స్ఫూర్తిదాయకమైన చిత్రంలో మరొక ఇంపాక్ట్ ఫుల్ పాత్రను పోషించడానికి సిద్ధంగా వున్నారు. 'గరివిడి లక్ష్మి' టైటిల్ తో రూపొందనున్న #PMF48 ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో గ్రాండ్ గా జరిగింది.
ఈ ఈవెంట్ భారీ సంఖ్యలో ప్రేక్షకులను అలరించింది.షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాను సెలబ్రేట్ చేయడం ద్వారా సినిమా ప్రమోషన్లలో కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. ఈ సరికొత్త చొరవను వెటరన్ యాక్టర్ నరేష్, ఎమ్మెల్యే పార్ధసారధి ప్రశంసించారు, ఇది ప్రాజెక్ట్పై నిర్మాతల విశ్వాసాన్ని హైలైట్ చేస్తుంది. ఈ చిత్రం ఉత్తర ఆంధ్రాకు చెందిన ఐకానిక్ బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి స్ఫూర్తిదాయకమైన కథను, మహిళల గుర్తింపు ఇతివృత్తాన్ని చిత్రీకరిస్తుంది.
ఎమ్మెల్యే పార్ధసారధి ఫస్ట్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ కెమెరా స్విచాన్ చేయడంతో పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్క్రిప్ట్పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న అపారమైన విశ్వాసం ఈవెంట్ గొప్పతనంలో స్పష్టంగా కనిపించింది, ఇది సినిమా విజయంపై వారి నమ్మకాన్ని చూపింది. జనవరి మూడో వారంలో ఆదోనిలో షూటింగ్ను ప్రారంభించనున్నారు.
ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ కుమార్తె టిజి కృతి ప్రసాద్ గరివిడి లక్ష్మి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. జె.ఆదిత్య కెమెరామ్యాన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: వెటరన్ యాక్టర్ నరేష్ , రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: టీజీ. విశ్వ ప్రసాద్, టి.జి. కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
సినిమాటోగ్రాఫర్ (DOP): J. ఆదిత్య
సంగీతం: చరణ్ అర్జున్
చీఫ్ కోఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాతాడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ చౌదరి కొల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: విజయ్ రెడ్డి, దుర్గాప్రసాద్ జి, సుకుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
మార్కెటింగ్ హెడ్ (PMF): తిరుమలశెట్టి వెంకటేష్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







