టర్కీయేలో బస్సులో మంటలు..35 మంది సౌదీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం..!!

- December 25, 2024 , by Maagulf
టర్కీయేలో బస్సులో మంటలు..35 మంది సౌదీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం..!!

ఇస్తాంబుల్: టర్కీయేలో టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో 35 మంది సౌదీ పర్యాటకుల బృందం తృటిలో తప్పించుకున్నారు. టర్కీ మీడియా ప్రకారం.. పర్యాటకులు సోమవారం సాయంత్రం గెబ్జే-ఓర్హంగజీ-ఇజ్మీర్ మోటర్‌వేలో బుర్సా నుండి ఇస్తాంబుల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 41 ఏళ్ల బస్సు డ్రైవర్ బస్సు జెమ్లిక్ బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఇంజిన్ నుండి భారీగా పొగలు కమ్ముకోవడం గమనించాడు. మంటలు బస్సును చుట్టుముట్టకముందే ప్రయాణికులను బస్సు నుండి సురక్షితంగా దించివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.  బస్సు డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న టర్కీ భద్రతా అధికారులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది.  ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి టర్కీ భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం సౌదీ పర్యాటకులను మరో బస్సులో ఇస్తాంబుల్‌కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com