దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగు వారి క్రూజ్ క్రిస్మస్ సంబరాలు
- December 25, 2024
దుబాయ్: దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగువారు క్రూజ్ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు.దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ శామ్యూల్ రత్నం, సిస్టర్ ఎస్తేరు ఆధ్వర్యంలో ఘనంగా Al Seef cruise నందు అంగరంగ వైభవంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. క్రైస్తవులు మరియు ఇతర మతస్థులందరూ 350 మందికి పైగా క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెదేపా ముఖ్యనేత T.D.జనార్దన్, తణుకు తెదేపా ఎమ్మెల్యే అరిమల్లి రాధాకృష్ణ మరియు ఇతర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా పాస్టర్ యేసు మేరీ జ్యోతి ఆధ్వర్యంలో బృందంగా క్రిస్మస్ కరల్స్ తో గాత్ర కచేరీలో అలరించారు.ఈ కార్యక్రమంలో బ్రదర్ అరవింద్ వుడ్స్- సాక్సోఫోన్, ఏలేటి వరప్రసాద్, పేడ్స్ వంటి సంగీత వాయిద్యాలను ప్లే చేశారు.ఈ కార్యక్రమంలో మరోక భాగంగా సిస్టర్ గ్లోరి ముఖ్య అతిథులను సత్కరించారు.ఈ కార్యక్రమంలో దుబాయ్ లోని వివిధ సంఘాల పోస్టర్స్ పాల్గొన్నారు. పాస్టర్ నేరపాటి ఇస్సాకు, పాస్టర్ G. భాగ్యనందం, పాస్టర్ రత్నరాజు, పాస్టర్ అడివల సంపదరావు, బ్రదర్ నసి కిరణ్,బ్రదర్ సతీష్ ఏలేటి బోయల్ మరియు మీడియా విభాగం మాగల్ఫ్, టీవీ 5 న్యూస్ నుంచి శ్రీకాంత్ చిత్తర్వు మరియు యూఏఈ NRI టిడిపి సభ్యులు ఈ క్రిస్మస్ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అలాగే, దుబాయ్ లో చర్చ్ ను నిర్మించుకునేందుకు దుబాయ్ ప్రభుత్వంతో మాట్లాడి భూమిని ఇప్పించాలని పాస్టర్లందరూ కలిసి తెదేపా సీనియర్ నేత టీడీ జనార్ధన్, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చర్చి నిర్మాణానికి అవసరమైన భూమిని ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
దుబాయ్ లో మునుపెన్నడూ కని విని ఎరుగని విధంగా క్రైస్తవ స్తోత్రం మరియు వాయిద్యాలతో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు.







తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







