చల్లని సేవ

- June 27, 2016 , by Maagulf

ఎండాకాలం..పైగా దుబాయ్ ఎండలు..అందునా పవిత్ర రమదాన్ మాసం..ఈ వేడికి కార్మిక సోదరులు ఎంతో అలసట చెందుతారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబాయ్ లోని జెబెల్ ఆలి లో గల డిస్కవరీ గార్డెన్స్ లో అక్కడి కమ్యూనిటీ సభ్యులు కలిసి స్ట్రీట్ 5 లో ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మహత్తర కార్యం శ్రీమతి నాహిద్ సాబీర్ గారి పర్యవేక్షణ లో జరిగింది. ఈ సందర్భంగా నాహిద్ సాబీర్ గారు మాట్లాడుతూ " ఈ ఫ్రిడ్జ్ లో మంచినీరు, పళ్ళ రసాలు, మజ్జిగ, చాకోలెట్లు, పళ్ళు, కేకులు, కప్ కేకులు, తాజా వంటకాలు మొదలైన వాటితో నింపవచ్చని చెప్పారు. డిస్కవరీ గార్డెన్స్, గార్డెన్స్, మసాకిన్ లో నివసిస్తున్న వారు తమ శక్తి మేరకు ఈ ఫ్రిడ్జ్ ను నింపి ఈ స్వచ్చంధ కార్యక్రమానికి చేయూతనివ్వాలని" పిలుపునిచ్చారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com