మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..
- December 26, 2024
న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. గురువారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో మన్మోహన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.
మన్మోహన్ సింగ్ (92) మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. వయో సంబంధిత వైద్య పరిస్థితులతో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ నేడు ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8గంటల 6 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి ఆయనను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. మన్మోహన్ సింగ్ రాత్రి 9గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







