ప్రవాస భారతీయ వంశీ గ్లోబల్ అవార్డు అందుకున్న శ్రీనివాస్ గూడూరు
- December 27, 2024
హైదరాబాద్: వృత్తి రీత్యా విదేశాల్లో స్థిర పడినప్పటికీ అక్కడ తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షణలో ఇక్కడ వున్నవారికన్నా తెలుగు సంప్రదాయాలు కళలు పట్ల తమ అభిమానం చూపుతున్నారని వంశీ ఇంటర్నేషనల్(India) స్థాపకుడు వంశీ రామరాజు అన్నారు. శ్రీ ముఖీ కాంప్లెక్స్ లోని ఎలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో స్థిరపడిన అమెరికాలో ఎస్.పి.బి మ్యూజిక్ ఇంటర్నేషనల్( USA) ఛైర్మెన్ శ్రీనివాస్ గూడూరుకు ప్రవాస భారతీయ వంశీ గ్లోబల్ అవార్డు ప్రదానోత్సవం సభ జరిగింది వంశీ రామరాజు అవార్డు బహుకరించి మాట్లాడారు విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం పేరిట సంగీత సంస్థను స్థాపించి అయన పాడిన పాటలు అక్కడి వారికి ప్రచారం చేస్తున్న పాటల ప్రియుడు శ్రీనివాస్ అన్నారు దేశం నుంచి తెలుగు వారు ఎవరు వెళ్లినా అయన సహాయ సహకారాలు అందిచే సహృదయుడు అని వివరించారు. ఇక్కడి తెలుగు గాయకులను పిలిపించి అక్కడ ప్రదర్శనలు కు తోడ్పటు అందించే మంచి మనిషి శ్రీనివాస్ అని కొనియాదారు.ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయకుడు పార్థ సారథి రామాచారి గాయకులు వినోద్ బాబు వై.ఎస్ రామకృష్ణ తదితరులు మధుర గీతాలు ఆలపించారు శైలజ సుంకరపల్లి మధుర వీణ సుధామయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









