ప్రవాస భారతీయ వంశీ గ్లోబల్ అవార్డు అందుకున్న శ్రీనివాస్ గూడూరు
- December 27, 2024
హైదరాబాద్: వృత్తి రీత్యా విదేశాల్లో స్థిర పడినప్పటికీ అక్కడ తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షణలో ఇక్కడ వున్నవారికన్నా తెలుగు సంప్రదాయాలు కళలు పట్ల తమ అభిమానం చూపుతున్నారని వంశీ ఇంటర్నేషనల్(India) స్థాపకుడు వంశీ రామరాజు అన్నారు. శ్రీ ముఖీ కాంప్లెక్స్ లోని ఎలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో స్థిరపడిన అమెరికాలో ఎస్.పి.బి మ్యూజిక్ ఇంటర్నేషనల్( USA) ఛైర్మెన్ శ్రీనివాస్ గూడూరుకు ప్రవాస భారతీయ వంశీ గ్లోబల్ అవార్డు ప్రదానోత్సవం సభ జరిగింది వంశీ రామరాజు అవార్డు బహుకరించి మాట్లాడారు విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం పేరిట సంగీత సంస్థను స్థాపించి అయన పాడిన పాటలు అక్కడి వారికి ప్రచారం చేస్తున్న పాటల ప్రియుడు శ్రీనివాస్ అన్నారు దేశం నుంచి తెలుగు వారు ఎవరు వెళ్లినా అయన సహాయ సహకారాలు అందిచే సహృదయుడు అని వివరించారు. ఇక్కడి తెలుగు గాయకులను పిలిపించి అక్కడ ప్రదర్శనలు కు తోడ్పటు అందించే మంచి మనిషి శ్రీనివాస్ అని కొనియాదారు.ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయకుడు పార్థ సారథి రామాచారి గాయకులు వినోద్ బాబు వై.ఎస్ రామకృష్ణ తదితరులు మధుర గీతాలు ఆలపించారు శైలజ సుంకరపల్లి మధుర వీణ సుధామయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్కు భారీ డిమాండ్..
- వరంగల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..







