ఇజ్రాయిల్ దాడి నుండి తృటిలో తప్పించుకున్న WHO చీఫ్
- December 27, 2024
ఐరాస: యెమెన్లో ఇజ్రాయిల్ దాడుల నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ తృటిలో తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. యెమెన్ రాజధాని సనా, బహుళ ఓడరేవులపై హౌతీలు లక్ష్యంగా గురువారం ఇజ్రాయిల్పై వైమానిక దాడులు జరిపింది. అదే సమయంలో డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అథనామ్ విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారని, రన్వేకు సమీపంలో జరిగిన బాంబు దాడిలో యుఎన్ విమాన సిబ్బంది ఒకరు గాయపడ్డారని అన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, విమానం కోసం వేచి ఉండు స్థలం (డిపార్చర్ లాంజ్), తాము ఉన్న ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో బాంబు పేలిందని, రన్వే దెబ్బతిందని టెడ్రోస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పేర్కొన్నారు. అయితే బాంబు దాడి నుండి తాను, తన సహచరులు తృటిలో తప్పించుకున్నామని తెలిపారు. దాడిలో మరణించినవారికి వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి ప్రకటించారు.
గాయపడిన వ్యక్తి యుఎన్ హ్యూమన్టేరియర్ ఎయిర్ సర్వీస్లో ఉన్నారని యుఎన్ ప్రతినిధి స్టెఫానీ ట్రెంబ్లె పేర్కొన్నారు.ఇజ్రాయిల్ దాడిలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారని సమాచారం.యుఎన్ బృందం సనాలో సురక్షితంగా ఉన్నారని ఆమె తెలిపారు. శుక్రవారం ఉదయం డబ్ల్యుహెచ్ఒ చీఫ్, యుఎన్ బృందం యెమెన్ నుండి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామని ట్రెంబ్లే పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం







