భారత్‌లో డేటాసెంటర్లు ప్రారంభించిన అమెజాన్‌

- June 28, 2016 , by Maagulf
భారత్‌లో  డేటాసెంటర్లు ప్రారంభించిన అమెజాన్‌

ప్రపంచంలోనే అతి పెద్ద క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను అందిస్తున్న అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్లుఎస్‌) భారత్‌లో మంగళవారం రెండు డేటా సెంటర్లను ప్రారంభించింది. ముంబయిలో రెండు డేటా సెంటర్లను అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సీఈఓ ఆండీ జాస్సీ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఎన్‌టీటీలకు పోటీగా అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను అందిస్తోంది. భారత్‌లో డేటా సెంటర్‌ లేకముందే అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కు ఇక్కడ 75వేల మంది యాక్టివ్‌ వినియోగదారులు ఉన్నారని.. డేటా సెంటర్ల ప్రారంభంతో వినియోగదారుల సంఖ్య బాగా పెరుగుతుందని ఆండీ అన్నారు. అయితే డేటా సెంటర్లపై ఎంత పెట్టుబడి పెట్టారనే ప్రశ్నకు ఆండీ సమాధానమివ్వడానికి నిరాకరించారు. మైక్రోసాఫ్ట్‌ గత ఏడాదే భారత్‌లో మూడు చోట్ల క్లౌడ్‌ డేటా సెంటర్లు ప్రారంభించింది. ఐబీఎం చె ్నేైలో డేటా సెంటర్‌ తెరిచింది. తాజాగా అమెజాన్‌ వీటిని ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com