దుబాయ్ లో మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరిమానా..!!
- January 02, 2025
దుబాయ్: డ్రగ్స్ను ఇతరులకు అందించేలా సహకరించినందుకు ఓ మహిళకు దుబాయ్లో ఐదేళ్ల జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరిమానా పడింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆమెను యూఏఈ నుంచి బహిష్కరించాలని కూడా ఆదేశించింది. రెండు సైకోట్రోపిక్ పదార్ధాలు( యాంఫేటమిన్,మెథాంఫేటమిన్) సరఫరా చేసినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ దోషిగా నిర్ధారించింది. ఈ కేసు ఏప్రిల్ 2, 2024లో చోటుచేసుకుంది. దుబాయ్లోని సత్వా ప్రాంతంలో ఒక వ్యక్తి డ్రగ్స్ వాడుతున్నాడని దుబాయ్ పోలీసుల యాంటీ నార్కోటిక్స్ విభాగానికి సమాచారం వచ్చింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాను యాంఫేటమిన్, మెథాంఫేటమిన్లను తీసుకున్నట్లు అంగీకరించాడు. రెండు పర్యాయాలు సదరు మహిళ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ వ్యక్తి నివాసం నుండి నాలుగు క్రిస్టల్ మెత్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు









