దుబాయ్ లో మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరిమానా..!!
- January 02, 2025
దుబాయ్: డ్రగ్స్ను ఇతరులకు అందించేలా సహకరించినందుకు ఓ మహిళకు దుబాయ్లో ఐదేళ్ల జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరిమానా పడింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆమెను యూఏఈ నుంచి బహిష్కరించాలని కూడా ఆదేశించింది. రెండు సైకోట్రోపిక్ పదార్ధాలు( యాంఫేటమిన్,మెథాంఫేటమిన్) సరఫరా చేసినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ దోషిగా నిర్ధారించింది. ఈ కేసు ఏప్రిల్ 2, 2024లో చోటుచేసుకుంది. దుబాయ్లోని సత్వా ప్రాంతంలో ఒక వ్యక్తి డ్రగ్స్ వాడుతున్నాడని దుబాయ్ పోలీసుల యాంటీ నార్కోటిక్స్ విభాగానికి సమాచారం వచ్చింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాను యాంఫేటమిన్, మెథాంఫేటమిన్లను తీసుకున్నట్లు అంగీకరించాడు. రెండు పర్యాయాలు సదరు మహిళ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ వ్యక్తి నివాసం నుండి నాలుగు క్రిస్టల్ మెత్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









