కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి: సీపీ సుధీర్ బాబు
- January 03, 2025
హైదరాబాద్: ఈ నూతన సంవత్సరంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల శాతం తగ్గింపుకు మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలలో భాగంగా కమిషనర్ సుధీర్ బాబు రాచకొండ పరిధిలోని డీసీపీలు, ఏడీసీపీలు మరియు ఇతర అన్ని స్థాయిల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేర పరిశోధనలో ఉపయోగిస్తున్న పలు రకాల టెక్నాలజీ పద్ధతులను మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి విధి నిర్వహణ మరింత సులభతరం అయ్యేందుకు ఉపయోగపడే నూతన టెక్నాలజీ గురించి కమిషనర్ చర్చించారు.నేర పరిశోధనలో మరియు విచారణలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మరియు అందుబాటులోకి వస్తున్న నూతన విచారణ విధానాలను అవలంబించాలని అధికారులకు కమిషనర్ సూచించారు. రాచకొండ పరిధిలోని అన్ని విభాగాల పోలీసు సిబ్బంది నేర విచారణలో నూతన సాంకేతిక వినియోగం పట్ల అవగాహన పెంచుకోవాలని, అందుకోసం ఐటీ సెల్ వారి సహాయాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిపి సైబర్ క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, ఏసిపి సి.సి.ఆర్.బి రమేష్, ఏసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









