కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి: సీపీ సుధీర్ బాబు
- January 03, 2025
హైదరాబాద్: ఈ నూతన సంవత్సరంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల శాతం తగ్గింపుకు మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలలో భాగంగా కమిషనర్ సుధీర్ బాబు రాచకొండ పరిధిలోని డీసీపీలు, ఏడీసీపీలు మరియు ఇతర అన్ని స్థాయిల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేర పరిశోధనలో ఉపయోగిస్తున్న పలు రకాల టెక్నాలజీ పద్ధతులను మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి విధి నిర్వహణ మరింత సులభతరం అయ్యేందుకు ఉపయోగపడే నూతన టెక్నాలజీ గురించి కమిషనర్ చర్చించారు.నేర పరిశోధనలో మరియు విచారణలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మరియు అందుబాటులోకి వస్తున్న నూతన విచారణ విధానాలను అవలంబించాలని అధికారులకు కమిషనర్ సూచించారు. రాచకొండ పరిధిలోని అన్ని విభాగాల పోలీసు సిబ్బంది నేర విచారణలో నూతన సాంకేతిక వినియోగం పట్ల అవగాహన పెంచుకోవాలని, అందుకోసం ఐటీ సెల్ వారి సహాయాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిపి సైబర్ క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, ఏసిపి సి.సి.ఆర్.బి రమేష్, ఏసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









