జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి...తొందర వద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- January 04, 2025
తిరుమల: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల పంపిణీ కేంద్రాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నానని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలారావుతో ఏర్పాట్లపై చర్చించానని చెప్పారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తులు గుర్తించాలని అన్నారు.10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండని తెలిపారు.
టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోకండని సూచించారు.19వ తేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకోవచ్చని తెలిపారు.వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు.అలిపిరి వద్ద నిర్మిస్తోన్న వైశ్రాయ్ హోటల్ పనుల నిలుపుదల అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









