జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి...తొందర వద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- January 04, 2025
తిరుమల: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల పంపిణీ కేంద్రాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నానని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలారావుతో ఏర్పాట్లపై చర్చించానని చెప్పారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తులు గుర్తించాలని అన్నారు.10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండని తెలిపారు.
టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోకండని సూచించారు.19వ తేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకోవచ్చని తెలిపారు.వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు.అలిపిరి వద్ద నిర్మిస్తోన్న వైశ్రాయ్ హోటల్ పనుల నిలుపుదల అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







